గాజోజు నాగభూషణం రచించిన ఋణం కథ చదివాను.తెలంగాణలో పల్లెల్లో రైతు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లుగా చిత్రించారు. ఈ అసమ సమాజంలో దోపిడీలు, భూకబ్జాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, న్యాయమూర్తులు, లంచాలకు పాల్పడుతున్నారు. ఇదేమని ఎవరు ప్రశ్నించరు. సామాన్యుడికి చివరికి చావే శరణ్యమవుతుంది. అన్ని వ్యవస్థలు భ్ర ష్టుపట్టాయి.ఈ వ్యవస్థ బాగు కోసం పోరాడే వాళ్ళు మౌనంగా ఉంటున్నారు.మరో మహాత్ముడు రావాలని ఆశావహ దృక్పథంతో ఎదురు చూడాలి.